మానవత్వం నశించింది?? మనుషులా?? మృగాలా ??

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుత్త తండా లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు మైనర్ బాలురు మామిడి కాయలు తెంపారని చెప్పి, వారిని దొరకబట్టి తోట కాపలాదారులు అతి దారుణంగా హింసించారు. వారి చేతులు, కాళ్ళను తాళ్లతో కట్టి, కట్టెలతో కొడుతూ హింసించారు. అంతే కాకుండా ఆవు పెండను నోట్లో కుక్కి అతి దారుణంగా వ్యవహరించారు. ఈ విషయం ఇటీవలే సాయంత్రం చోటుచేసుకుంది విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ అనంతరం అందుకు బాధ్యులైన ఇద్దరు తోట కాపలా దారులపై కేసు నమోదు చేశారు. అయితే వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా తోట కావాలి దారులు పరారీలో ఉన్నట్లు తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here