గోదావరి ఖని:దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ (నీటిపై తేలియాడే) సోలార్ పవర్ ప్లాంట్ ను రాష్ట్రంలోని రామగుండంలో ఏర్పాటు కానుంది.100 మెగావాట్ల విద్యుత్ ఉత్ప త్తి సామర్థ్యంతో ఎన్టీపీసీ సంస్థ దీన్ని ఏర్పాటు చేయనుంది.ఈ ప్లాంట్ పనులు ఇప్పటికే నిర్మాణ దశలో ఉండగా మే నెల నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా 450 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్ప త్తి ప్లాంట్ల నిర్మాణం చేపట్టనున్న ఎన్టీపీసీ అందులో భాగంగా రామగుండంలో ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయనుందని ఎన్టీపీసీ సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీవీ ఆనంద్ తెలిపారు.