న్యూయార్క్:అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కరోనా మహమ్మారి అలజడి మరోసారి ఆందోళనకి గురి చేస్తుంది.కరోనా మహమ్మారి కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నాయి.వ్యాక్సి నేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ నిత్యం లక్షల్లో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి.జులై నుంచి కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ మరణాల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు.ప్రతిరో జూ రెండువేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయని అమెరికా ఆరోగ్య శాఖ తెలిపింది.కరోనా మహమ్మారి తో బుధవారం ఒక్కరోజే రెండు వేలమంది కంటే ఎక్కువ మంది మరణించిన ట్లు ‘న్యూయార్క్ టైమ్స్’ వెల్లడించింది.గడిచిన వారంలో ప్రతిరోజూ సగటున 2012 మంది మృతిచెందినట్లు తెలిపింది.కరోనా మరణాలు ముఖ్యంగా ఫ్లోరిడా టెక్సాస్ కాలిఫో ర్నియా నుంచి అధికంగా నమోదవుతున్నాయి.అమెరికాలో రోజుకి రెండు లక్షలకి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.ప్రభుత్వం తీసుకున్న కోవిడ్ నిబంధనలతో కాస్త కట్టడి పడింది.మళ్లీ లాక్డౌన్ ఎత్తివే త జనజీవనం సాధారణస్థితికి చేరడంతో కొత్త కేసులు పెరుగుతున్నాయి.ఈ నేపథ్యంలోనే నిన్న కూడా రెండు లక్షల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు.అయితే కేసుల సంఖ్య తగ్గుతు న్నప్పటికీ మరణాలు మాత్రం రెండువేలకు పైగానే నమోదవుతున్నాయి.గురువారం ఉదయం జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ సిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ దేశంలో ప్రస్తు త కేసులు మరియు మరణాల సంఖ్య వరుసగా 42539373 మరియు 681111 గా ఉన్నట్లు వెల్లడించింది.అయితే డెల్టా వేరియంట్ కారణంగానే భారీ స్థాయిలో జనం వైరస్ బారిన పడుతున్నట్లు అమెరికా వ్యాధి నియంత్రణ నిర్మూలన కేంద్రం (CDC) వెల్లడించింది.99 శాతం కేసులు డెల్టా వేరియంట్వేనని తెలిపింది.అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 54 శాతం ప్రజలు రెం డు డోసులు తీసుకోగా 63 శాతం మొదటి డోసు తీసుకున్నారు.అమెరికా వ్యాప్తంగా హాస్పిటల్స్ల్లో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి ఆగస్టు చివరి వారంలో నాలుగు సంవత్సరాలు అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు అత్యధిక సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు సీడీసీ తెలిపింది.
Latest article
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...