న్యూయార్క్:అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కరోనా మహమ్మారి అలజడి మరోసారి ఆందోళనకి గురి చేస్తుంది.కరోనా మహమ్మారి కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నాయి.వ్యాక్సి నేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ నిత్యం లక్షల్లో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి.జులై నుంచి కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ మరణాల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు.ప్రతిరో జూ రెండువేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయని అమెరికా ఆరోగ్య శాఖ తెలిపింది.కరోనా మహమ్మారి తో బుధవారం ఒక్కరోజే రెండు వేలమంది కంటే ఎక్కువ మంది మరణించిన ట్లు ‘న్యూయార్క్ టైమ్స్’ వెల్లడించింది.గడిచిన వారంలో ప్రతిరోజూ సగటున 2012 మంది మృతిచెందినట్లు తెలిపింది.కరోనా మరణాలు ముఖ్యంగా ఫ్లోరిడా టెక్సాస్ కాలిఫో ర్నియా నుంచి అధికంగా నమోదవుతున్నాయి.అమెరికాలో రోజుకి రెండు లక్షలకి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.ప్రభుత్వం తీసుకున్న కోవిడ్ నిబంధనలతో కాస్త కట్టడి పడింది.మళ్లీ లాక్డౌన్ ఎత్తివే త జనజీవనం సాధారణస్థితికి చేరడంతో కొత్త కేసులు పెరుగుతున్నాయి.ఈ నేపథ్యంలోనే నిన్న కూడా రెండు లక్షల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు.అయితే కేసుల సంఖ్య తగ్గుతు న్నప్పటికీ మరణాలు మాత్రం రెండువేలకు పైగానే నమోదవుతున్నాయి.గురువారం ఉదయం జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ సిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ దేశంలో ప్రస్తు త కేసులు మరియు మరణాల సంఖ్య వరుసగా 42539373 మరియు 681111 గా ఉన్నట్లు వెల్లడించింది.అయితే డెల్టా వేరియంట్ కారణంగానే భారీ స్థాయిలో జనం వైరస్ బారిన పడుతున్నట్లు అమెరికా వ్యాధి నియంత్రణ నిర్మూలన కేంద్రం (CDC) వెల్లడించింది.99 శాతం కేసులు డెల్టా వేరియంట్వేనని తెలిపింది.అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 54 శాతం ప్రజలు రెం డు డోసులు తీసుకోగా 63 శాతం మొదటి డోసు తీసుకున్నారు.అమెరికా వ్యాప్తంగా హాస్పిటల్స్ల్లో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి ఆగస్టు చివరి వారంలో నాలుగు సంవత్సరాలు అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు అత్యధిక సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు సీడీసీ తెలిపింది.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్లో ఎన్నో కేఫ్లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్ను చూశారా ఈ కేఫ్లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...