ముంబై:దేశంలోని కొత్త కరెన్సీ నోట్లపై పలువురు ప్రముఖులు ఫోటోలను ముద్రించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) భావిస్తున్నట్టు మీడియాలో వచ్చిన వార్తలు సంచనలం సృష్టించా యి.అయితే ఈ వార్తలను ఆర్బీఐ ఇవాళ ఖండించింది.ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని అలాంటి ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది.ప్రస్తుతం చలామణిలో ఉన్న కరెన్సీ,బ్యాం కునోట్ల లో మార్పు ఉండదని వివరణ ఇచ్చింది.కొత్త కరెన్సీ నోట్లపై విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్,మిసైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం ఫోటోలను కూడా ముద్రించాలని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోందని, కేంద్ర ఆర్థిక శాఖ,ఆర్బీఐ సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నాయని వార్తలు వచ్చాయి.ఫోటోల డిజైన్లను కేంద్రం ఆమోదించినట్టు వార్తలు వైరల్ అయ్యాయి.
Latest article
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...
దేశంలో కరోనా డేంజర్ బెల్స్
న్యూఢిల్లీ:భారత దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.రోజువారి కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి.గత కొద్ది రోజుల కేసులు గణనీయంగా పెరిగాయి.తాజాగా భారతదేశంలో గడిచిన 24 గంటల్లో 3,016 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి,నిన్నటితో పోలిస్తే...
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...