అమావాస్య రోజు ఆడపిల్ల పుట్టిందని..పసికందును వదిలివెళ్లిన కసాయి తల్లి..!

0
305

రాజన్న సిరిసిల్లా:అమావాస్య రోజు దేశ వ్యాప్తంగా పండుగ జరుపుకుంటున్న వేళా మరో వైపు అమావాస్య రోజు ఆడపిల్ల పుట్టిందని అప్పుడే పుట్టిన పసికందును రోడ్డు పక్కన వదిలి వెళ్లిన దారుణ ఘటన రాజన్న సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్‌ మండల కేంద్రంలో చోటు చేసుకుంది.అమావాస్య రోజు పుట్టిందనో,లేక మరో కారణమే కానీ పసికందును కసాయివాళ్లు పోలీ స్‌ స్టేషన్‌కు సమీపంలో వదిలివెళ్లారు.పసికందు ఏడుపులు విన్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆరుబయట చలిలో వణుకుతున్న పసికందును ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు.పసికందును పరీక్షించిన వైద్యులు తగిన వైద్యాన్ని అందిస్తున్నారు.పసికందును ఎవరు వదిలివెళ్లార్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here