ముంబై:క్రూజ్ నౌక డ్రగ్స్ కేసు వ్యవహారంలో బాలీవుడ్ అగ్ర హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ కు కోర్టు షాకిచ్చింది.ఆర్యన్ తో సహా ఎనిమిది మంది నిందితులకు ముంబయి సిటీ కోర్టు ఈ నెల 11వరకు జ్యుడిషియిల్ కస్టడీ విధించింది.ఈ నెల 11వరకు తమ కస్టడీకి ఇవ్వాలన్న కస్టడీకి ఇవ్వాలన్న ఎన్సీబీ అభ్యర్థతను తోసిపుచ్చిన న్యాయస్థానం నిందితులకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.ఇప్పటికే తగినంత సమయం ఇచ్చినందున నిర్బంధ విచారణ అవసరం లేదని అభిప్రాయపడినట్టు న్యాయమూర్తి తెలిపారు.జ్యుడిషి యల్ కస్టడీ విధించిన నిమిషాల వ్యవధిలోనే ఆర్యన్ తరఫు న్యాయవాది మానేశ్ శిందే మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.అయితే,దీనిపై రేపు ఉదయం 11గంటలకు విచా రణ జరపనున్నట్టు న్యాయమూర్తి తెలిపారు.విచారణ సమయంలో షారుక్ ఖాన్,అతడి సతీమణి గౌరీఖాన్ కోర్టులో లేరు.అక్టోబర్ 3న గోవాకు చెందిన క్రూజ్ నౌకలో రేవ్ పార్టీ జరుగు తుందని సమాచారం అందుకున్న ఎన్సీబీ అధికారులు జరిపిన దాడుల్లో ఆర్యన్ ఖాన్,మూన్మూన్ ధామేచ,అర్బాజ్ మెర్చంట్ సహా ఎనిమిది మంది ప్రముఖుల పిల్లలను అరెస్ట్ చేసి న విషయం తెలిసిందే.వీరిని ఇటీవల కోర్టులో హాజరు పరచగా తదుపరి దర్యాప్తు నిమిత్తం ఎన్సీబీకి అప్పగించింది.ఆ కస్టడీ నేటితో ముగియడంతో మరోసారి నిందితులను అధికారులు కోర్టులో హాజరుపరచగా ఆర్యన్ సహా ఎనిమిది మందికి న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించింది.ఆర్యన్ సహా ఈ కేసులో నిందితులను ఈ రాత్రికి ముంబయిలోని ఎన్సీబీ కార్యాల యం లోనే ఉంచనున్నారు.ఎన్సీబీ కార్యాలయంలో ఆర్యన్ను కలిసేందుకు కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించినట్టు సమాచారం.
Latest article
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...