హైదరాబాద్:చాలా బాధతో రాజీనామా నిర్ణయం తీసుకున్నానని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి,టీపీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్రెడ్డి అన్నారు.హుజురాబాద్ టికె ట్ తనకే వస్తుందని ఓ కార్యకర్తతో ఫోన్లో జరిపిన సంభాషణ సంచలనం సృష్టించడంతో పార్టీ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.24 గంటల్లో వివరణ ఇవ్వా లని తెలిపింది.పాడి కౌశిక్ రెడ్డి గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ టీఆర్ఎస్ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నట్టు ఫిర్యాదు లు వచ్చాయి.దీంతో కౌశిక్రెడ్డి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి,పీసీసీ కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు.అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ఎంతో బాధ తో రాజీనామా నిర్ణయం తీసుకున్నా.రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావాలని కోరుకున్న వారిలో నేను మొదటివాడిని.రూ.50కోట్లు ఇచ్చి రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్షు డు అయ్యారు.హుజురాబాద్లో కాంగ్రెస్ గెలవదన్న రేవంత్ వ్యాఖ్యలు బాధాకరం.పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి భ్రమల్లో ఉన్నారు అని కౌశిక్ విమర్శించారు.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్లో ఎన్నో కేఫ్లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్ను చూశారా ఈ కేఫ్లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...