న్యూఢిల్లీ:భారత అత్యున్నత న్యాయస్థానం 48వ ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు నేలకు చెందిన జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం స్వీకారం చేశారు.ఈ ఉదయం రాష్ట్రప తి భవన్లో ఆయన చేత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు.ఇప్పటి వరకు సీజేఐగా ఉన్న ఎస్.ఎ.బోబ్డే పదవీకాలం నిన్నటితో ముగిసిన విషయం తెలిసిందే.తాజాగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ ఎన్వీ రమణ 2022 ఆగస్టు 26 వరకు పదవిలో కొనసాగుతారు.ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,ప్రధాని మోదీ,సు ప్రీంకోర్టు న్యాయమూర్తులు,కేబినెట్ మంత్రులు,న్యాయమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు,జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సభ్యులు,తదితర ప్రముఖులు ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.
![](https://assets-news-bcdn.dailyhunt.in/cmd/resize/400x400_80/fetchdata16/images/e5/0e/28/e50e28a88af0547086757b8f6eda822bb90e203c5e772906611027a3f80be023.jpg)