ఇవి హత్యలా?..ఆత్మహత్యలా…?

సిద్దిపేట:ఇద్దరు యువకులు బావిలో శవాలుగా తేలిన ఘటన బుధవారం సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట అర్బన్ మండలం బూర్గుపల్లి గ్రామ శివారు లోని బుగ్గ బావిలో ఉదయం ఈత కోసం వెళ్లిన కొందరు వ్యక్తులు బావిలో పడి ఉన్న ఇద్దరు యువకుల శవాలను చూసి పోలీసులకు సమాచారం అందించారు.సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు.మృత దేహాలను బావిలోని చేపలు,క్రిమికీటకాలు తినడంతో మృత దేహాలు గుర్తు పట్టకుండా ఉన్నాయి.పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు.రూరల్ ఎస్ ఐ అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ గుర్తు తెలియని శవాలుగా కేసు నమోదు చేసి,ఆత్మహత్యా లేదా హత్య అనే కోణంలో దర్యాప్తు చేపట్టి నట్లు తెలిపారు.పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ మార్చరికి తరలించినట్లు వెల్లడించారు.మృతదేహాల కోసం వారి బంధువులు ఎవరైనా ఉంటే రూరల్ పోలీసులను సంప్రదించాలని వా రు కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here