సిద్దిపేట:ఇద్దరు యువకులు బావిలో శవాలుగా తేలిన ఘటన బుధవారం సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట అర్బన్ మండలం బూర్గుపల్లి గ్రామ శివారు లోని బుగ్గ బావిలో ఉదయం ఈత కోసం వెళ్లిన కొందరు వ్యక్తులు బావిలో పడి ఉన్న ఇద్దరు యువకుల శవాలను చూసి పోలీసులకు సమాచారం అందించారు.సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు.మృత దేహాలను బావిలోని చేపలు,క్రిమికీటకాలు తినడంతో మృత దేహాలు గుర్తు పట్టకుండా ఉన్నాయి.పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు.రూరల్ ఎస్ ఐ అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ గుర్తు తెలియని శవాలుగా కేసు నమోదు చేసి,ఆత్మహత్యా లేదా హత్య అనే కోణంలో దర్యాప్తు చేపట్టి నట్లు తెలిపారు.పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ మార్చరికి తరలించినట్లు వెల్లడించారు.మృతదేహాల కోసం వారి బంధువులు ఎవరైనా ఉంటే రూరల్ పోలీసులను సంప్రదించాలని వా రు కోరారు.
Latest article
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...
దేశంలో కరోనా డేంజర్ బెల్స్
న్యూఢిల్లీ:భారత దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.రోజువారి కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి.గత కొద్ది రోజుల కేసులు గణనీయంగా పెరిగాయి.తాజాగా భారతదేశంలో గడిచిన 24 గంటల్లో 3,016 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి,నిన్నటితో పోలిస్తే...
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...