మళ్ళీ కరోనా కోరల్లో భారత్

న్యూఢీల్లి:ఇండియాలో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది.మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్ళీ పుంజుకున్నాయి.అయితే తాజాగా నిన్నటి కంటే తక్కువ గానే ఇవ్వాళ కరోనా కేసులు నమోదు అయ్యాయి.కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో 11739 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీం తో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,33,89,973 కు చేరింది.ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 92,576 కు చేరింది.ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 970.22 శాతంగా ఉంది.ఇక దేశంలో తాజాగా 25 మంది కరోనా తో మరణించగా మృతుల సంఖ్య 5,24,999 కి చేరింది.గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 10917 మంది కరోనా నుంచి కోలు కున్నారు.ఇక దేశ వ్యాప్తంగా ఆరికవరీల సంఖ్య 4,27,72,398 కు చేరింది.ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,97,08,51,580 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.ఇక గడిచిన 24 గంటల్లో 12, 72,739 మందికి కరోనా వ్యాక్సిన్లు ఆరోగ్య శాఖ వేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here