దళితబందు అమలు కోసం..దప్పుల మోత..!

0
323

కరీంనగర్:హుజురాబాద్ నియోజకవర్గం పైలెట్ ప్రాజెక్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన దళిత బందును హుజురాబాద్ లోవెంటనే అమలు చేయాలని,కెసిఆర్ నాలుగో తారీఖు నుం డి దళిత బంధు పంపిణీ చేస్తామని ప్రకటించినా ఇంత వరకూ ఏ ఒక్క దళితుడికి దళిత బంధు పథకం రాకపోవడాన్ని నిరసిస్తూ బిజెపి దళిత మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాదులో భా రీ డప్పుల మోత కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు బిజెపి దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు సోమిడివేణు ప్రసాద్ తెలిపారు.ఆదివారం రోజున బీజేపీ దళిత మోర్చా జిల్లా కార్యవర్గ,పదాది కారుల సమావేశం స్థానిక రేకుర్తి లో సాయి మహాలక్మి గార్డెన్స్ లో జరిగింది.ఇట్టి కార్యక్రమానికి హాజరైన జిల్లా అధ్యక్షులు సోమిడి వేణు ప్రసాద్ మాట్లాడుతూ దళిత బంధు అమలు కో సం డప్పుల దరువు అనే కార్యక్రమంతో రాష్ట్రంలోని అన్ని జిల్లా ల నుండి పదివేల డప్పుల తో కెసిఆర్ కి కళ్ళు తెరిపించి దళిత బంధు వెంటనే అమలు చేసే విధంగా మోత మోగించే విధంగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.కరీంనగర్ జిల్లా నుండి సుమారు 500 మంది డప్పు కళాకారులు ఇట్టి నిరసన కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన చెప్పారు.కెసిఆర్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని అబద్ధపు హామీలతో అవసరాలు తీర్చుకునేపరిస్థిని దళిత సమాజం గ్రహించిందన్నారు.హుజురాబాద్ ఎన్నికల అస్త్రంగా దళితబందు ప్రవేశపెట్టిన కెసిఆర్ వైఖరి దళిత సమాజం గ్రహించింది అన్నారు.రాబోయే రోజుల్లో దళితబందు ప్రతి దళిత కుటుంబానికి అందేవరకు బిజెపి దళిత మోర్చా ఆధ్వర్యంలో అలుపెరగనిపోరాటం ఉద్యమం చేస్తా మని దళిత బంధు రాష్ట్రమంతా అమలయ్యే వరకు విశ్రమించేది లేదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.దళిత బంధు అమలు పోరాటంలో ప్రభుత్వంపై దండయాత్రకి దళిత జాతి ప్ర తిఒక్కరు సిద్ధం కావాలి అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో దళిత మోర్చా అధికార ప్రతినిధి జాడి బాలరెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శులు పులమల్ల ప్రసాద్,తూర్పాటి రాజు,ఉపాధ్య క్షులు అభిలాష్,జిల్లా మల్లేశం,పరుశారం,బండారి వేణుగోపాల్,నిఖిల్,ప్రసన్న,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here