హుజురాబాద్:టీఆర్ఎస్ లో అంతా స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడుతారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ బాంబు పేల్చారు.రాసిచ్చింది మాట్లాడడం తప్ప సొంతంగా మాట్లా డే అధికారం ఎవ్వరికీ లేదని హాట్ విమర్శలు చేశారు.మంగళవారం ఈటల విలేకరులతో మాట్లాడారు.20 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీలో చాలా చూశానని అందరి లిస్ట్ నా దగ్గరి ఉందని ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు.మంత్రులుగా కాకుండా మనుషులుగా మాట్లాడాలని హితవు పలికారు.కనీసం ఆ మంత్రులకు అయినా ఇక నుంచి కేసీఆర్ గౌరవం ఇవ్వాలని కోరుతున్నానని ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఇస్తారని ఆశిస్తున్నానని ఈటల రాజేందర్ అన్నారు.ఇక టీఆర్ఎస్ లోని ఎవ్వరి గురించి తాను కా మెంట్ చేయనని ఈటల చెప్పుకొచ్చారు.నన్ను ఈ స్థానంలోకి తీసుకొచ్చింది టీఆర్ఎస్ సీఎం కేసీఆర్ అని టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేయలేదని అన్నారు.మంత్రి కేటీఆర్ సీఎం అభ్యర్థిత్వాన్ని తాను వ్యతిరేకించలేదని అన్నారు.కేటీఆర్ సీఎం కావాలని స్వాగతించానని అన్నారు.నాపై కక్ష సాధించడం సరికాదని ఎవరి మాటలపై స్పందించను అని నాతో ఎవరేం మాట్లాడారో తెలుసు అంటూ ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు.
Latest article
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...