హుజురాబాద్:కరీంనగర్ జిల్లా సైదాపూర్ పోలీస్ స్టేషన్ హుజురాబాద్ ఏసీపీ కోట్ల వెంకట్ రెడ్డి మీడియా సమావేశం నందు నిందితులను హాజరుపరిచి వివరాలు వెల్ల డించారు.నేరం చేయువిధానం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రానికి చెందిన నీర్ల కళ్యాణ్,అనగోని వికాస్,కనుకుంట్ల అనిల్ మరియు తూటి వినయ్ లు హు జురాబాద్ పట్టణంలోని లార్జ్ లాజిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నందు ఫ్లిప్ కార్ట్ కొరియర్ బాయ్స్ గా గత 3 నెలల నుండి పనిచేయడం జరుగుతుంది.ఈ క్రమంలోనే వీ రు జల్సాలకు అలవాటు పడి ఎలాగైనా కంపెనీకి సంబంధించిన కొరియర్స్ లోని వస్తువులను దొంగిలించి వాటి స్థానంలో రాళ్లు,పెంకులు,బండలను పెట్టి,అట్టి విధంగా దొంగిలించిన వస్తువులను అమ్ముకొని తద్వారా వచ్చిన డబ్బులతో జల్సాలు చేయాలని నిర్ణయిం చుకున్నారు.హుజురాబాద్ లోని ఫ్లిప్ కార్ట్ హబ్ కి రాగానే,వాటిని డెలివరీ కోసం వారి పేరుపై అసైన్ చేసుకొని సైదాపూర్ కి తీసుకెళ్ళేవారు.అక్కడ ముందు గానే అనుకున్నట్లు బుక్ చేసిన ఫోన్ నంబర్ కి ఫోన్ చేసి,ఆ ఫోన్ నంబర్ నుండి వారి మిత్రుల ద్వారా అట్టి ఆర్డర్స్ రిజెక్ట్ చేయడంగాని,ఆర్డర్ చేసిన ఫోన్ నంబర్ ని స్విచ్ ఆఫ్ పెట్టి లేక కాల్ లిఫ్ట్ చేయకుండా ఉండి,కస్టమర్ నుండి రెస్పాన్స్ లేదు అని చెప్పి,తర్వాత ఎవరు చూడని ప్రదేశంలో ఏర్పడకుండా వాటిని కత్తిరించి తీసి,అందులో రాళ్లు,పెంకులు,బండలను వస్తువుల బరువు కి తగ్గట్టు పెట్టి,వాటి ని మళ్ళీ కంపెనీకి రిటర్న్ చేసే వారు.తర్వాత అట్టి ఖరీదైన వస్తువులను అమ్ముకొని తద్వారా వచ్చిన డబ్బులతో జల్సాలు చేసే వారు.ఇట్టి క్రమంలో అనుమానం వచ్చిన ఫ్లిప్ కార్ట్ కంపెనీ నందు హుజురాబాద్ హబ్ కి టీం లీడర్ గా పని చేస్తున్న హుజురాబాద్ పట్టణానికి చెం దిన ముప్పు నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారించగా,దర్యాప్తులో ఇలాంటి చాలా వస్తువులను మోసం చేసి దొంగిలించినట్లు తెలిసింది.నిందితులు పట్టుబడిన విధానం పక్క సమాచారం మేరకు ఆదివారం రోజున ఉదయం 12 గంటలకు నిందితులు మళ్ళీ ఇలాంటి తరహా నేరాలు చేయడం కోసం సైదాపూర్ బస్ స్టాండ్ వద్ద వేచి ఉన్న తరుణంలో సైదాపూర్ ఎస్సై ప్రశాంత్ రావు తన సిబ్బందితో సంయుక్త ముగా వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా ఇట్టి నేరాన్ని ఒప్పుకోవ డంతో పాటు,వారి వద్ద నుండి పై వస్తువులను స్వాధీనం చేసుకోవడం జరిగింది.నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న వస్తువులు.ల్యాప్ టాప్స్08,కెమెరాలు04,వాచీలు05,ముబైల్ ఫోన్స్05, ఎయిర్ పాడ్స్04,వైర్లెస్,చార్జర్01,సోనీ మ్యూజిక్ సిస్టం 01,నైక్ షూస్03,రోడ్ స్టార్ జాకె ట్01,ఆపిల్ పెన్సిల్01,మొత్తం విలువ అందాజ.తొమ్మిది లక్షల రూపా యలు పిర్యాదిదారుడి వివరాలు,ముప్పు నవీన్ s/o స్వామి,24సం,రజక,టీం లీడర్,లార్జ్ లాజిక్ ప్రైవేట్ లిమిటెడ్,r/o హుజురా బాద్.నిందితుల వివరాలు..నీర్ల కళ్యాణ్ s/o మల్లేశం,24సం,తెనుగు r/o సైదాపూర్,అనగోని వికాస్ s/o సంపత్,23సం,గౌడ్ r/o సైదాపూర్,కనుకుంట్ల అనిల్ s/o వెంకట్రాజం,26 సం,పద్మ శాలి r/o సైదాపూర్,తూటి వినయ్ s/o వేణు,22సం,తెనుగు r/o సైదాపూర్,నిందితులను పట్టుకోవడం లో శ్రమించిన హుజురాబాద్ రూరల్ సిఐ ఎర్రల కిరణ్, సైదాపూర్ ఎస్సై బండ ప్రశాంత్ రావు,ట్రైనీ ఎస్సై తిరుపతి,కానిస్టేబుల్స్ రాజు,పార్థసారధి,కుమార్,రంజిత్,సతీష్ లను హుజురాబాద్ ఏసీపీ కోట్ల వెంకట్ రెడ్డి అభినం దించారు.
Latest article
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...