హనుమకొండ:తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదట దళితులకు ద్రోహం చేసింది సీఎం కేసీఆర్ అని మాజీ మంత్రి,బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు.రాష్ట్రానికి దళితుడినే మొద టి సీఎంను చేస్తానని చెప్పి మాట తప్పారని విమర్శించారు.హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మర్రిపల్లి,మర్రిపల్లిగూడెం,జూజునూరు,వంగపల్లి,పంగిడిపల్లి,లక్ష్మీపూర్ గ్రా మాల్లో గురువారం ఈటల ఎన్నికల ప్రచారం చేశారు.దళితలకు మూడెకరాల భూమి,డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేదని చెప్పారు.ఇప్పుడు కేసీఆర్ దళిత బంధు ఇస్తుంటే,ఇతరులు ఆపుతున్నట్లుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.తాను రాజీనామా చేస్తేనే దళిత బంధు వచ్చిందని,అలాంటిది తన దిష్టి బొమ్మలను ఎందుకు తగల బెడుతున్నారని ప్రశ్నించారు.దళిత బంధు ఆపాలని తాను ఎవరికీ లేఖ రాయలేదని చెప్పారు.సీఎం కేసీఆర్ తర్వాత ఆయన కొడుకు,మనవడు రాష్ట్రాన్ని ఏలాలనే ఎజెండాతో పనిచేస్తున్నారని ఆరోపిం చారు ఈటలను కొట్టగలిగే శక్తి కేసీఆర్కే కాదు,ఆయన జేజమ్మకు కూడా లేదని అన్నారు.
Latest article
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...