హైదరాబాద్:ఈటల దెబ్బకు ఫామ్ హౌజ్ ను వదలిని కేసీఆర్ ఏ ప్రభుత్వ ఆసుపత్రి వైపు కన్నెత్తి చూడని కెసిఆర్,గాంధీ అసుపత్రికి పరుగులు తీశారు.తప్పని పరిస్థి లో గాంధీ లో కోరోనా రోగులను సందర్శించి,పరామర్శించారు.కరోన ను ఆరోగ్యశ్రీలో చేర్చి పేదనలు అదుకోవాలన్ని ఈటల న్యాయమైన డిమాండ్ ను పక్కన పెట్టి ఆ యుష్మాన్ భవ పథకంలో చేరిన ప్రభుత్వం.ఈటల రాజేందర్ ను కుట్ర పూరితంగా మంత్రి వర్గం నుండి భర్తరఫ్ చేసిన తర్వాత అన్ని వర్గాలనుండి కేసీఆర్ కు తీవ్రవ్య తిరేకత వ్యక్తం అవ్వడంతో కేసీఆర్ బెంబేలెత్తిపోతున్నారు.ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న ఈటల కరోనా కట్టడి కొసం చేసి కృషి యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు.అ లాంటి ఈటలను మంత్రి వర్గం నుండి తొలగించిన కేసీఆర్ పై అటు పార్టీలోను ఇటు ప్రజల్లోను విమర్శలు వెల్లవెత్తున్నాయి.దీంతో సిఎం కేసీఆర్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు.ఎర్రవల్లి ఫామ్ హౌజ్ కే పరిమితమైన కేసీఆర్ ఈటల దెబ్బతో గాంధీ ఆసుపత్రి కి రాక తప్పలేదు.రాష్ట్రంలో ఎవరికి కోరోన వచ్చిన గాంధీకే రావాలని చేప్పి తాను మాత్రం యశోధకు వెళ్లడంతో తెలంగాణ ప్రజలు కేసీఆర్ పట్ల ఈసడించుకున్నారు.దీంతో దిక్కు లేక ఒటమిని అంగికరించి గాంధీ అసుపత్రిని సందర్శించారు. గాంధీకి వెల్లి పరిస్థితులన చూసి ఈటల రాజేందర్ చేసిన కృషి,త్యాగాన్నితన మనసులో తాను అత్మవిమర్శ చేసుకొని ఉంటారు.కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఈ టల డిమాండ్ చేశారు.పేదలను అదుకోవాలని విజ్జాప్తి చేశారు.మరో వైపు నిరుద్యోగుల గురించి ఈటల సందించిన ప్రశ్నలు,తెలంగాణ యువత నిరోద్యోగంలో కొట్టు మిట్టాడుతుంటే తెలంగాణ వచ్చి ఏం ప్రయోజనమని ఈటల రాజేందర్ అవేదన వ్యక్తం చేశారు.దీంతో తెలంగాణ ప్రజలనుండి విశేషమైన స్పందన రావడంతో కేసీఆర్ ఉటాహుటిన తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమీషన్ ఏర్పాటు (టిఎస్పిఎస్సీ) చైర్మన్ ను సభ్యులను నియమించడం ఈటల రాజేందర్ విజయమని స్పష్టం అవుతుంది.