బీజాపూర్:సుకుమా-బీజాపూర్ జిల్లాల సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందినవారి సంఖ్య 22గా చత్తీస్ఘడ్ ప్రభుత్వం ప్రకటించింది.ఇంక రాకేష్ అనే జ వాను జాడ తెలియలేదు.ఆయన జాడ కోసం దళాలు ఇంకా వెతుకుతున్నాయి.బీజాపూర్ ఎన్కౌంటర్లో మృతి చెందినవారిలో అత్యధిక చత్తీస్ఘడ్ వాసులే.మృ తుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందినవారు ఇద్దరు ఉన్నారు.కోబ్రా దళానికి చెందిన గుంటూరు జిల్లా గౌత్పూడికి చెందిన శాఖమూరి మురళీ కృష్ణ,విజయనగరం జిల్లా దిగువ వీధికి చెందిన రఘు జగదీష్.ఇతర మృతుల వివరాలు డీఆర్జీ దళం వీరందరూ చత్తీస్ఘడ్వాసులుదీపక్ భరద్వాజ్,రాకేష్ కుమార్,నారాయణ్ సోధి,రాకేష్ కోర్సా, సుభాష్ నాయక్,కిషోర్ ఎండ్రిక్,సంకురామ్ సోధి,భోసారామ్ కర్టామీ వీరందరూ చత్తీస్ఘడ్వాసులు శ్రవణ్ కశ్యప్,రామ్దాస్ కౌర్యం,జగత్రామ్ కందర్,సుఖ్సింహ్ ఫ రస్,రామ్ శంకర్ పైకరా,శంకర్ నాథ్,కోబ్రా210 దళం,దిలీప్ కుమార్ దాస్ (అసోమ్),రాజ్ కుమార్ యాదవ్ (ఉత్తర ప్రదేశ్),శంభూరాయ్ (త్రిపుర),ధర్మదేవ్ కుమా ర్ (ఉత్తరప్రదేశ్),శాఖమూరి మురళీ కృష్ణ (ఆంధ్రప్రదేశ్),రఘు జగదీష్ (ఆంధ్రప్రదేశ్),బాబూల్ రంభ (అసోమ్)బస్తర్ బెటాలియన్,సమయా మాడ్వీ (బీజాపూర్, చత్తీస్ఘడ్),ఈ ఎన్కౌంటర్ జరిగిన తరవాత కోబ్రా బెటాలియన్కు చెందిన రాకేష్ సింహ్ మనహాస్ ఆచూకీ ఇంకా తెలియడం లేదని అధికారులు తెలిపారు.దళాలు ఆయన కూడా ఇంకా వెతుకుతూనే ఉన్నాయని పేర్కొన్నారు.