ప్రతి పల్లె అభివృద్ధి చెందుతుంది- జెడ్పీచైర్ పర్సన్ దావ వసంత

జగిత్యాల రూరల్ మండలంలోని ఒడ్డెర కాలనీ నూతన గ్రామ పంచాయతీ భవనానికి శుక్రవారం జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్, జెడ్పి చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ భూమి పూజ నిర్వహించారు. అనంతరం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పి చైర్ పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తె.రా.స పార్టీ రోజు రోజుకు బల పడుతుందని, ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో ప్రతి పల్లె అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని అన్నారు.‌ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here