పంజగుట్ట ప్లై ఓవర్ కు అగ్నిప్రమాదం…..
తాజాకబురు హైదారాబాద్: పంజాగుట్ట ఫ్లై ఓవర్ వద్ద శుక్రవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పిల్లర్స్కు ఏర్పాటు చేసిన డెకరేషన్స్ సామాగ్రికి మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. నల్లని పొగ కమ్మేయడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరికి లోనయ్యారు. అగ్నిప్రమాదంతో పంజాగుట్ట వద్ద భారీగా ట్రాఫిక్ జాం అయింది.