న్యూఢిల్లీ:అదనపు వనరులను సేకరించే క్రమంలో ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తోన్న కేంద్ర ప్రభుత్వం రూ .2.5 లక్షల కోట్ల ఆస్తి మోనటైజేషన్ పైప్లైన్లో భాగంగా ఢిల్లీ,ముంబై,బెంగళూరు,హైదరాబాద్ విమానాశ్రయాలలో మిగిలిన ప్రభుత్వ వాటాలను విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తుంది.ఇందుకోసం 13 విమానా శ్రయాలను గుర్తించిన ప్రభుత్వం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI)లోని నాలుగు విమానాశ్రయాలలో మిగిలిన వాటాను 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటీకరణ చేయనున్నట్లు చెబుతున్నారు.ఈక్విటీ వాటాను ఉపసంహరించుకోవడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అవసరమైన అనుమతులు పొందుతుం దని,ఈ సమస్యను రాబోయే కొద్ది రోజుల్లో ఆమోదం కోసం కేబినెట్కు పంపనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.ప్రైవేటీకరణ కోసం గుర్తించిన 13 AAI వి మానాశ్రయాల్లో లాభదాయకమైన మరియు లాభాపేక్షలేని విమానాశ్రయాలను క్లబ్బింగ్ చేసి అమ్మకానికి పెట్టాలని భావిస్తున్నారు.ప్రైవేటు సంస్థల నుంచి ఆకర్షణీ యమైన రేటు కోసం ఈ మేరకు నిర్ణయం తీసుకుంటోంది ప్రభుత్వం.త్వరలో విక్రయించబోయే విమానాశ్రయాల జాబితాలో అమృత్సర్,వారణాసి,భువనేశ్వర్,ఇండో ర్,రాయ్పూర్,తిరుచ్చి తదితర విమానాశ్రయాలు ఉన్నట్లుగా చెబుతున్నారు.నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో మొదటి రౌండ్ విమానాశ్రయాల ప్రైవేటీకరణలో అ దానీ గ్రూప్ గత ఏడాది లక్నో,అహ్మదాబాద్,జైపూర్,మంగళూరు, తిరువనంతపురం,మరియు గౌహతి ఆరు విమానాశ్రయాలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.పౌర విమానయాన మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తున్న AAI, దేశవ్యాప్తంగా 100 కి పైగా విమానాశ్రయాలను నిర్వహిస్తుంది.ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో అ దానీ గ్రూప్ 74 శాతం వాటాను కలిగి ఉంది,మిగిలిన 26 శాతం వాటా AAIకి ఉంది.ఇప్పుడు మిగిలిన వాటను అమ్మేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జిఎంఆర్ గ్రూప్ 54 శాతం,ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 26 శాతం,ఫ్రాపోర్ట్ ఎజి,ఎరామన్ మలేషియా ఒక్కొక్కటి 10 శాతం వాటాను కలిగి ఉన్నాయి.హైదరాబాద్ విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్లో AAIకి 26 శాతం వాటా ఉంది.బెంగళూరు విమానాశ్రయంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి ఏఏఐకి 26 శాతం వాటా ఉంది.AAI తో పాటు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం లో కూడా బెంగళూరు ప్రభుత్వం వాటాను కలిగి ఉంది.చమురు,గ్యాస్ పైప్లైన్ల వంటి 100 ఆస్తులను అమ్మి డబ్బు ఆర్జించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా దీని ద్వారా రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులు రావచ్చని కేంద్రం భావిస్తోంది.
Latest article
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...