రాజ్యసభకు..నలుగురు దక్షిణాది వారే

న్యూఢీల్లి:సంగీత దర్శకుడు ఇళయరాజా రాజ్యసభకు నామినేట్ అయ్యారు.ఆయనతో పాటు దర్శకుడు రాజమౌళి తండ్రి వి.విజయేంద్ర ప్రసాద్‌,లెజండరీ అథ్లెట్ పీటీ ఉష,కర్నాటకలోని ధర్మస్థల దే వాలయ సంరక్షకుడు సంఘ సంస్కర్త వీరేంద్ర హెగ్డే కూడా రాజ్యసభకు నామినేట్ అయ్యారు.ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో వెల్లడించారు.వారికి శుభాకాంక్షలు తెలిపా రు.రాజ్యాంగాధికారం ప్రకారం సంగీత,సాహిత్య,వైజ్ఞానికత,ఆర్థిక రంగాలతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను 12 మందిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్‌ చేసే అధికారం ఉంది.ఆ కోటా లోనే ఆరేళ్ల కింద మోదీ ప్రభుత్వం సుబ్రమణ్యస్వామిని ఎగువ సభకు పంపింది.ఆయన పదవీ కాలం త్వరలో ముగియనుంది.ఇళయరాజా ఇటీవల ‘అంబేద్కర్‌-మోదీ’ పుస్తకానికి ముందుమాటలో ప్రధాని మోదీ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ ఆశయాలను నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు.ఆ వ్యాఖ్యలపై చర్చ జరిగిన నేపథ్యంలో తాజాగా ఆయనకు రాజ్యసభకు వెళ్లే అదృష్టం దక్కడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here