న్యూఢిల్లీ:పెద్దల సభకు ఎన్నికల నగారా మోగింది.దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ సీట్లకు ఎన్నికలకు గురువారం షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.ఖాళీకానున్న రాజ్య సభ సీట్ల కోసం మే 24న నోటిఫికేషన్ విడుదల చేస్తారు.నామినేషన్ల స్వీకరణకు తుది గడువు మే 31వ తేదీగా నిర్ణయించింది ఈసీ.జూన్ 1వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు.నామినేషన్ల ఉప సంహరణకు జూన్ 3 వరకు గడువు ఉంటుంది.జూన్ 10న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది.అదే రోజు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు.మొత్తం 57 సీట్లలో ఆంధ్ర ప్రదేశ్ నుంచి నాలుగు,తెలంగాణ నుంచి రెండు సీట్లు భర్తీ చేయాల్సి ఉంది.ఏపీ నుంచి ఎంపీలు విజయసాయిరెడ్డి,సురేష్ ప్రభు,టీజీ వెంకటేష్,సుజనా చౌదరిల పదవీకాలం ముగియ నుంది.అలాగే తెలంగాణ నుంచి కెప్టెన్ లక్ష్మీకాంతరావు,ధర్మపురి శ్రీనివాస్లు రిటైర్ అవుతున్నారు.అలాగే బండ ప్రకాష్ స్థానం ఖాళీ అయినందున ఆ స్థానానికి కూడా ఎన్నిక జరుగనుంది.
Latest article
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...