కోల్కతా:లక్షల విలువ చేసే రిలీఫ్ మెటీరియల్ దొంగిలించారన్న ఆరోపణలపై బిజెపి నేత సువేందు అధికారి,ఆయన సోదరుడిపై పోలీస్ కేసు నమోదైంది.పూర్బా మె డ్నిపూర్ జిల్లాలోని మున్సిపల్ కార్యాలయం నుండి వీటిని దొంగిలించారని కాంతి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ బోర్డు సభ్యుడు రత్నదీప్ మన్నా చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.గత నెల 29న సువేందు అధికారి ఆయన సోదరుడు,కాంతి మున్సిపాలిటీ మాజీ మున్సిపల్ చీఫ్ సౌమేందు అధికారి ఆదేశా ల మేరకు ఈ మున్సిపాల్టిటీ కార్యాలయం గోడౌన్ తాళాలు అక్రమంగా పలగల గొట్టి లక్షల విలువ చేసే సహయ సామాగ్రిని తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు.గ తంలో తృణమూల్ నేతలు ఇలా సహాయ సామాగ్రిని కొట్టేస్తున్నారని బిజెపి ఆరోపణలు చేయగా ఇప్పుడు సువేందు,ఆయన సోదరుడిపై ఇవే ఆరోపణలతో కేసు న మోదు కావడం గమనార్హం.దొంగతనానికి పాల్పడే సమయంలో వారిద్దరు భద్రత నిమిత్తం భద్రతా బలగాలను ఉపయోగించారని ఫిర్యాదుదారు పేర్కొన్నారు.చీటింగ్ కేసులో సువేందు అధికారి సన్నిహితుడుపై కేసు నమోదైన మరుసటి రోజే ఈ దొంగతనం కేసు దాఖలైంది.
Latest article
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...