కోల్కతా:లక్షల విలువ చేసే రిలీఫ్ మెటీరియల్ దొంగిలించారన్న ఆరోపణలపై బిజెపి నేత సువేందు అధికారి,ఆయన సోదరుడిపై పోలీస్ కేసు నమోదైంది.పూర్బా మె డ్నిపూర్ జిల్లాలోని మున్సిపల్ కార్యాలయం నుండి వీటిని దొంగిలించారని కాంతి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ బోర్డు సభ్యుడు రత్నదీప్ మన్నా చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.గత నెల 29న సువేందు అధికారి ఆయన సోదరుడు,కాంతి మున్సిపాలిటీ మాజీ మున్సిపల్ చీఫ్ సౌమేందు అధికారి ఆదేశా ల మేరకు ఈ మున్సిపాల్టిటీ కార్యాలయం గోడౌన్ తాళాలు అక్రమంగా పలగల గొట్టి లక్షల విలువ చేసే సహయ సామాగ్రిని తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు.గ తంలో తృణమూల్ నేతలు ఇలా సహాయ సామాగ్రిని కొట్టేస్తున్నారని బిజెపి ఆరోపణలు చేయగా ఇప్పుడు సువేందు,ఆయన సోదరుడిపై ఇవే ఆరోపణలతో కేసు న మోదు కావడం గమనార్హం.దొంగతనానికి పాల్పడే సమయంలో వారిద్దరు భద్రత నిమిత్తం భద్రతా బలగాలను ఉపయోగించారని ఫిర్యాదుదారు పేర్కొన్నారు.చీటింగ్ కేసులో సువేందు అధికారి సన్నిహితుడుపై కేసు నమోదైన మరుసటి రోజే ఈ దొంగతనం కేసు దాఖలైంది.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్లో ఎన్నో కేఫ్లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్ను చూశారా ఈ కేఫ్లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...