సరస్సులో కొట్టుకొచ్చిన రూ.2వేల నోట్ల కట్టలు

రాజస్థాన్:ఓ సరస్సులో రూ.2వేల నోట్ల కట్టలు భారీగా కొట్టుకొచ్చాయి అయితే ఆ నోట్ల కట్టలు మొత్తం 30 నుంచి 32నోట్ల కట్టటుంటాయి.రాజస్థాన్​ అజ్మేర్​లోని ఆనాసాగర్ సరస్సులో రూ.2వేల నోట్ల కట్టలు తేలియాడాయి.పాలిథీన్​ బ్యాగులో ఉన్న వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.మొత్తం 30 నుంచి 32 నోట్ల కట్టలు ఉన్నాయని,అన్నీ రూ.2వేల నోట్లే అని అధికారులు చెప్పారు. పుష్కర్​ రోడ్డులోని ఈ సరస్సులో భారీగా కరెన్సీ నోట్లు ఉన్నాయని తమకు సమాచారం అందిందని,వచ్చి చూస్తే నిజంగానే నోట్ల కట్టలు ఉన్నాయని చెప్పారు.అయితే ఈ నోట్లు నకిలీవా?లేక నిజమై నవా?అనే విషయం తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.చూడటానికి మాత్రం నిజమైన నోట్ల లాగే ఉన్నాయని,నీటిలో తడవడం వల్ల నిర్ధారించుకోలేకపోతున్నట్లు చెప్పారు.నిపుణుల సాయంతో నోట్లు అసలువో,కాదో తెలుసుకుంటామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here