హైదరాబాద్:ఇటీవల కాలంలో పరువు హత్యలు పెరిగిపోతున్నాయి.కూతురు లేదా కుమారుడు ప్రేమ వివాహాం చేసుకోవడం నచ్చని కుటుంబ సభ్యులు దారుణాలకు తెగబడుతున్నారు.తమ పరు వు పోయిందని బావిస్తూ వారిని అంతమొందించేందుకు వెనుకాడడం లేదు.ఇటీవల సరూర్ నగర్లో నాగరాజును హత్యను మరువక ముందే తాజాగా బేగంబజార్లో దారుణం చోటు చేసుకుంది.ప్రే మ వివాహం చేసుకున్నాడన్న కారణంతో యువ వ్యాపారిని శుక్రవారం రాత్రి అందరూ చూస్తుండగానే హతమార్చారు.వివరాల్లోకి వెళితే బేగంబజార్ కోల్సావాడిలో నీరజ్కుమార్ పన్వర్(22) తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు.ఇతడు పల్లీల వ్యాపారం చేస్తుండేవాడు.అదే ప్రాంతానికి చెందిన సంజన(20)ను ఏడాదిన్నర కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు.వీరికి నెలన్నర క్రితం బాబు జన్మించాడు.ఈ క్రమంలో సంజన కుటుంబ సభ్యులు క్షక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది.శుక్రవారం రాత్రి నీరజ్ ఇంటికి వెలుతుండగా బేగం బజార్ పరిధిలోని మచ్చి మార్కెట్లో సంజన సోదరుడు త న స్నేహితులతో నీరజ్పై దాడి చేసి హతమార్చాడు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.రక్తపు మడుగులో పడి ఉన్న నీరజ్ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అ ప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు.సీసీ కెమెరాల ఆధారంగా ఐదుగురు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Latest article
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...