హైదరాబాద్:దేశవ్యాప్తంగా భానుడు భగభగ మండిపోతున్నాడు.దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ నెలలో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఉత్తర,వాయవ్య,మధ్య భారతంలో అయితే రికార్ఢు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.ఈ మేరకు 122 ఏండ్ల రికార్డు బద్ధలైంది.వాయువ్య,మధ్య భారత దేశంలో 122 ఏండ్లలో తొలిసారి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైన నెలగా ఏప్రిల్ నిలిచిందని వాతా వరణ విభాగం వెల్లడించింది.సగటు ఉష్ణోగ్రతలే వాయవ్య భారతంలో 35.90 డిగ్రీలుగా,మధ్య భారతంలో 37.78గా నమోదయ్యాయని ఐఎండీ తెలిపింది.ఇక ఈ నెలలో ఉత్తరాది రాష్ట్రాల్లో సగటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయని ఐఎండీ తెలిపింది.దక్షిణాదిలోని కొన్ని ప్రాంతాలను మినహాయిస్తే, మే నెలలో దేశంలోని అనేక ప్రాంతాల్లో రాత్రివేళల్లో సైతం వేడిగా ఉంటుందని తెలిపింది.భారత్లో ఏప్రిల్లో సగటు ఉష్ణోగ్రతలు 35.05 డిగ్రీలు నమోదవ్వగా 122 సంవత్సరాల్లో నాల్గవ అత్యధికమని చెప్పారు.మే 2022లో సగటు వర్షపాతం సాధారణం కన్నా ఎక్కువగా న మోదయ్యే అవకాశాలున్నాయని చెప్పారు.
Latest article
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...