జగిత్యాల: మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాలోని కూకటపెళ్లి లోని కాముని చెరువు శిఖం భూమిలో అక్రమ నిర్మాణాలను కూల్చడానికి వెళ్లిన రెవెన్యూ అధికారులపై, ఉద్యోగులపై భూకబ్జాదారులు దాడి చేయడాన్ని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షుడు ఎం.డీ.వకీల్, అధ్యక్షుడు హరి అశోక్ కుమార్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు భోగ శశిధర్ లు తీవ్రంగా ఖండించారు. శనివారం వారు రెవెన్యూ భవన్ లో మాట్లాడుతూ దాడికి పాల్పడ్డ, పురికొల్పిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, ఇలాంటి ఘటనలు జిల్లాల్లో పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. జిల్లాల్లో విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా రాత్రింబవళ్ళు విధులు నిర్వహిస్తున్న రెవెన్యూశాఖ ఉద్యోగులకు, అధికారులకు ప్రభుత్వ భూముల పరిరక్షణ లో పోలీసు భద్రత కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి చెలుకల కృష్ణ, కోశాధికారిగా ఎన్. తిరుమల రావ్, రమేష్ , రాజేందర్ రావ్, రాజేంద్రప్రసాద్, సత్యనారాయణ, అబూబాకర్ తదితరులు పాల్గొన్నారు.
Latest article
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...