ప్రశ్నించే వారు ఉన్నపుడే గ్రామం అభివృద్ధి జరుగుతుంది

జగిత్యాల / రాయికల్: ఫిబ్రవరి 26(తాజా కబురు విలేకరి): గ్రామ పంచాయతీ సమావేశాలు ఏర్పాటు చేయడానికి కోరం ఎంత ఉండాలని వార్డు సభ్యులు ఏలేటి జలంధర్ రెడ్డి సర్పంచ్ సామల్ల లావణ్య ను కోరారు.శుక్రవారం రోజున రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో నెలరోజులు పూర్తి అవుతున్నప్పటికీ గ్రామ పంచాయతీ పాలకవర్గం సమావేశం ఏర్పాటు చేసినట్టే చేసి కోరం రావడం లేదని వాయిదా వేయడం జరిగిందన్నారు.ఫిబ్రవరి నెల గడుస్తున్నప్పటికీ గ్రామ పంచాయతీ సమావేశం ఏర్పాటు చేయకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశ్నించే వారు ఉన్నపుడే గ్రామం అభివృద్ధి జరుగుతుందని,గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి నెలలు గడుస్తున్నా పనులు చేయకపోవడం గ్రామ పంచాయతీ పాలకవర్గం సమావేశం ఏర్పాటు చేయకపోవడం చాలా దురదృష్టకరమని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here