దొంగతనానికి వచ్చాడు,తాళం పగలగొట్టాడు అమ్మవారిని చూసి భయపడి పారిపోయాడు...
అతనో దొంగ అమ్మవారి ఆలయంలో దొంగతనం చెయ్యాలని దైర్యాన్ని మూటగట్టుకొని వచ్చాడు,ముఖద్వారాన్ని అతి కష్టమీద పగలగొట్టాడు కానీ గర్బగుడిలోకి వెళ్లకా ఏం చేశాడో మీరె చూడండి…
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో జరిగిన సంఘటన గురించి తెలుసుకుందాం… శివరాత్రి పర్వదినం సందర్బంగా అందరు శివాలయాల్లో పూజలు,జాగరణలు,కళ్యాణాలు చేస్తుంటె మనోడికి పట్టణ శివారులో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ఆలయం పై కన్నుపడింది ఎలాగైనా అమ్మవారి హుండీ అలాగే ఆభరణాలు ఎత్తుకెళ్లాలని అనుకున్నాడు,ఇకా శివరాత్రి ఉదయం పన్నెండు తర్వాత రంగంలోకి దిగాడు,చేతిలో ఓ సుత్తె పట్టుకొని ఆలయంలో కి ప్రవేశించాడు,అటు ఇటు చూస్తూ తన చేతిలో ఉన్న సుత్తెతో తాళం కష్టంగా పగలగొట్టాడు, ఇకా ఆలయ గర్బగుడిలోకి ఎంటరిచ్చాడు ఇకా ఎత్తుకెళ్లటమె ఆలస్యం అన్నట్టు చూశాడు,ఎదురుగా మహాలక్ష్మి అమ్మవారి ఆకారాన్ని చూశాడు భయపడ్డడో ఏమె దొంగోడు నేను దొంగతనం చెయ్యను అని ఎలా తీసినా తలుపులు అలా వేసి అక్కడి నుండి జంప్ అయ్యాడు, ఈ మద్య కాలంలో నె అమ్మవారి జాతర ఉత్సవాలు జరిగాయి అధిక మొత్తంలో బంగారు నగదు ఎత్తుకెళ్లాలని అనుకున్నాడు కానీ భయపడిపోయి జారుకున్నాడు ఉదయం శివరాత్రి వేడుకలు జరుపుకొని ఆలయం లోని పూజారి వచ్చెసరికి ఆలయ తలుపులు పగలగొట్టి ఉన్నాయి,వెంటనే పోలీసులకు సమాచారం అందించారు సీసీ కెమెరా నిక్షిప్తమైన వీడియో పుటేజ్ ని స్వాధీనం చేసుకుని దొంగకోసం గాలిస్తున్నారు….