కిష్టంపేట్ వాసి గల్ఫ్ వాసి మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని జగిత్యాల ఎమ్మెల్యేకు వినతి
రాయికల్ తాజా కబురు: రాయికల్ మండలంలోని కిష్టంపేట గ్రామానికి చెందిన కొమిరెల్లి రాజు ఈ నెల 7న ఇరాక్ లో మరణించగా.. మృతదేహాన్ని రప్పించేలా చొరవ తీసుకోవాలని ఆయన కుమారుడు సాంబయ్య ఎమ్మెల్యేను కోరారు.దీంతో స్పందించిన ఎమ్మెల్యే నిరుపేదలు కావటంతో వెంటనే ముఖ్యమంత్రికి లేఖ రాశారు.ప్రభుత్వ ఖర్చులతో ఇరాక్ దేశంనుండి మృతదేహం త్వరగా రప్పించేలా చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.