కరోనా నుండి కోలుకున్న వారికి వ్యాక్సిన అవసరం లేదు..
ఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. వ్యాక్సినేషన్ ప్రారంభమైన 24 రోజుల నుంచి దేశవ్యాప్తంగా 60 లక్షల మందికి కోవిడ్ టీకా ఇచ్చారు. ఈ నేపథ్యంలో వైరాలాజిస్టులు, హెల్త్ ఎక్స్పర్ట్స్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కోవిడ్ బారిన పడి కోలుకున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదన్నారు. ఎందుకంటే సహజంగా తయారయిన యాంటీబాడీలు.. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల అభివృద్ధి అయిన యాంటీబాడీల కంటే ఎక్కువ రోజులు.. ఎక్కువ సమర్థవంతంగా పని చేస్తాయని తెలిపారు.