అసత్య ప్రచారాలు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాం గొల్లపల్లి యస్సై జీవన్
జగిత్యాల / గొల్లపల్లి (తాజా కబురు విలేకరి): కోడి పందెం నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి మరణించడాని, దర్యాప్తులో భాగంగా ఆ కోడిని సంరక్షించాల్సిన బాధ్యత పోలీసులపై ఉండటంతో కోడిని రక్షించే క్రమంలోనె. ఆ కోడిని కోళ్ల పారంలో సంరక్షణ నిమిత్తం అప్పగించడం జరిగిందని జగిత్యాల జిల్లా గొల్లపల్లి యస్సై జీవన్ అన్నారు. అంతేకాని కోడిని అరెస్ట్ చేయడం కానీ, అదుపులోకి తీసుకోవడం కాని జరగలేదని, తప్పుడు వార్తలు ప్రసారం చేయడం నిలిపివేయాలని సంబంధిత మీడియా వారికి సూచిస్తున్నామని తెలిపారు.ఎవరైనా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే వారిపై చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.